← Back to news

నేత్రదానం చేయండి.. ఇద్దరికి చూపు ఇవ్వండి: DMHO డాక్టర్ కృష్ణ

By Bhasker· 25 Aug 2026· TG
నేత్రదానం చేయండి.. ఇద్దరికి చూపు ఇవ్వండి: DMHO డాక్టర్ కృష్ణ

TG : కళ్లు దానం చేస్తే ఇద్దరు అంధులకు చూపు ఇవ్వవచ్చని నాగర్‌కర్నూల్ DMHO డాక్టర్ కె. కృష్ణ చెప్పారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగుతున్న నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా పాలెం ZPHS స్కూల్‌లో అవేర్‌నెస్ ర్యాలీ నిర్వహించారు. మనిషి చనిపోయిన 6 గంటల్లోపే కళ్లు దానం చేయడం చాలా ముఖ్యం. అందరూ నేత్రదానంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ ప్రోగ్రామ్‌లో డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక, హెల్త్ స్టాఫ్ పాల్గొన్నారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 22m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.