ఏపీలో మళ్లీ కరోనా కేసులు

AP: ఏపీలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. జూన్ 26 నుంచి ఇప్పటివరకు మొత్తం 13 పాజిటివ్ కేసులు గుర్తించారు. కడపలో 8, గుంటూరులో 3, విశాఖ, కాకినాడలో ఒక్కో కేసు నమోదయ్యాయి. వైరస్ ఏ వేరియంట్ అనేది తెలుసుకోవడానికి ఐదు శాంపిల్స్ను పూణె ల్యాబ్కు పంపించారు. ప్రస్తుతం బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉండగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెల్త్ డిపార్ట్మెంట్ సూచించింది.



