ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి విద్యార్థినుల రాఖీలు!

రాఖీ పౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి విద్యార్థినులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థినులు ఎమ్మెల్యేను ఆత్మీయంగా కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ – విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జక్కా రాజ్కుమార్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్ పాల్గొన్నారు.

