ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్

TG : రంగారెడ్డి జిల్లా కొహెడలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సూసైడ్ ఘటన కలకలం రేపింది. హన్మకొండకు చెందిన దేవేందర్ రెడ్డి కొహెడలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో నాలుగు రోజుల క్రితమే తన నివాసం నుంచి హాస్టల్కు వచ్చాడు. హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం ఘటన జరిగిన వెంటనే తమకు సమాచారం ఇవ్వకుండా ఆలస్యంగా చెప్పారని తల్లిదండ్రులు ఆరోపించారు.



