'అది ప్రమాదం కాదు, ప్లాన్తోనే నిప్పంటించాడు'

TG: మిర్యాలగూడలోని కలల్వాడ కాలనీలో ఈ నెల 5న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో వనం చంద్రమ్మ (50), ఆమె మనువడు నక్కా లక్ష్మణ్(16), మనవరాలు నక్కా ప్రణతి(14) సజీవ దహనమైన విషయం తెలిసిందే. పోలీసుల లోతైన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. అది ప్రమాదం కాదని, పెట్రోల్ పోసి తగలబెట్టి ప్రమాదంగా చిత్రీకరించారని తేల్చారు. చంద్రమ్మ పెద్ద కుమార్తె ధనమ్మకు, భర్త శిరీశ్కుమార్కు ఇల్లు నిర్మించుకునే విషయంలో ఆర్థికపరమైన గొడవలు జరిగాయి. దీంతో శిరీశ్కుమార్, గాఢనిద్రలో ఉన్న చంద్రమ్మ, పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.



