← Back to news

పండగపూట ఆర్టీసీ బాదుడు

By Raju· 28 Aug 2026

TG: హైదరాబాద్ నుంచి కరీంనగర్ సాధారణ రోజుల్లో రూ.290 ఉంటే రాఖీ రోజు రూ.400కు పెంచడంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రాఖీ పండుగ పేరుతో ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో చార్జీల బాదుడు ఏంటని ప్రశ్నిస్తున్నారు. పండుగల పేరుతో ఆర్టీసీ ఇష్టానుసారంగా చార్జీలు పెంచడం సరికాదంటున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పెట్టాలంటే ఇలా అదనంగా వసూళ్లు చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.

More in Local