← Back to news

తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డుల విధానం అమలు

By S.R.Samstha· 15 Aug 2026
తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డుల విధానం అమలు

TG: భువనగిరి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులతో పాటు ఆధునిక సాంకేతికతతో స్మార్ట్ కార్డులు అందిస్తోందన్నారు.

తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డుల విధానం అమలు

More in TG