← Back to news

చనిపోయాడనుకున్న కొడుకు తిరిగొచ్చాడు

By DK· 23 Jul 2026· కర్నూలు జిల్లా
చనిపోయాడనుకున్న కొడుకు తిరిగొచ్చాడు

AP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హృదయాన్ని కదిలించే ఘటన జరిగింది. 1996లో పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై ఇంటి నుంచి ముంబయికి వెళ్లిపోయిన రాముడు అనే యువకుడు 30 ఏళ్ల తర్వాత భార్య సుశీల, కుమార్తె సంజనతో కలిసి సొంతూరుకు చేరుకున్నాడు. SIR కోసం తల్లిదండ్రుల వివరాలు అవసరమవడంతో తన పాత ఇంటిని వెతికాడు. రెండురోజులు వెతికిన తర్వాత వాకిట్లో ఉన్న తల్లిని గుర్తించి పిలిచాడు. మొదట గుర్తుపట్టని ఆ తల్లి, అతడు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పగానే భావోద్వేగానికి లోనైంది. చనిపోయాడనుకున్న కుమారుడు తిరిగి రావడంతో ఆమె ఆనందంతో మురిసిపోయింది.

చనిపోయాడనుకున్న కొడుకు తిరిగొచ్చాడు

More in AP