← Back to news

వరి, చెరకు సాగుపై అలర్ట్‌

By DK· 22 Jul 2026
వరి, చెరకు సాగుపై అలర్ట్‌

TG: ఎల్‌నినో ప్రభావం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జూన్‌లో ప్రారంభమైన ఈ ప్రభావం డిసెంబరు వరకు తీవ్రంగా ఉండి, వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఖరీఫ్‌ తర్వాత యాసంగి సాగు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం, చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వల్ల నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి, చెరకు వంటి పంటలు వేయొద్దని రైతులకు సూచించారు. ఆగస్టులో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నా, సెప్టెంబరులో ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

More in TG