భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య

TG: ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న మంచాల మండలం నోముల గ్రామంలో బాబు అనే వ్యక్తి ఫిబ్రవరి 24, 2026న తన భార్యను దారుణంగా చంపేశాడు. ఆ రోజు నుంచి అతడు ఊరికి దూరంగా ఉంటున్నాడు. అయితే, గురువారం రాత్రి తన భార్య సమాధి పక్కనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. భార్యను చంపిన అతడే ఆమె సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకోవడం స్థానికులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.



