← Back to news

భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య

By RK· 31 Jul 2026
భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య

TG: ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న మంచాల మండలం నోముల గ్రామంలో బాబు అనే వ్యక్తి ఫిబ్రవరి 24, 2026న తన భార్యను దారుణంగా చంపేశాడు. ఆ రోజు నుంచి అతడు ఊరికి దూరంగా ఉంటున్నాడు. అయితే, గురువారం రాత్రి తన భార్య సమాధి పక్కనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. భార్యను చంపిన అతడే ఆమె సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకోవడం స్థానికులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.