మూసీ నిర్వాసితులకు 2BHK ఇళ్లు

TG: మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్పై CM సమీక్ష నిర్వహించారు. భూసేకరణ కోసం ఆసక్తిగా ఉన్న వారికి టీడీఆర్ లేదా పరిహారం చెల్లించాలని రేవంత్ చెప్పారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణశాఖ భూముల్లో ఉన్న కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలన్నారు. ప్రజల సందర్శన కోసం నెక్లెస్ రోడ్డులో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూసీ ప్రాజెక్టులో చేపట్టబోయే పనులు ఇందులో ప్రతిబింబించాలని అన్నారు.



