వర్ష బీభత్సం.. హైదరాబాద్లో ఇద్దరు మృతి

TG: హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు యువకులు కరెంట్ షాక్తో మృతి చెందారు. పాతబస్తీలో ఆటో దిగిన యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా కరెంట్ వైర్లు తగలడంతో షాక్ కొట్టింది. వెంటనే స్థానికులు హాస్పిటల్కు తరలించేలోపే వారిద్దరూ చనిపోయారు. భారీ వర్షం వల్ల సిటీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరెంటు తీగలు తెగి పడిపోయాయి. వర్షంతోపాటు ఈదురుగాలులు కూడా వీయడంతో చాలా చోట్ల వైర్లు తెగి నేలపై పడ్డాయి. దీంతో అక్కడక్కడ కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై సహాయ చర్యలు చేపట్టారు.



