← Back to news

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు

By Srinivas· 23 Aug 2026· నాగర్ కర్నూలు

TG : నాగర్ కర్నూలు జిల్లా చారకొండ రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యం పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

More in Local