← Back to news

హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్

By డీకే· 5 Jul 2026
హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్

AP ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ప్రముఖ యూట్యూబర్, ప్రశ్న రావణ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుల దర్యాప్తును CBIకి అప్పగించాలని ఆయన హైకోర్టును కోరారు. ప్రతివాదులుగా AP ప్రభుత్వం, DGPతో పాటు పలువురు జిల్లా SPలను చేర్చారు. యూట్యూబర్ రావణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనున్నట్లు AP హైకోర్టు తెలిపింది.

More in AP