అబార్షన్కు భార్య అంగీకరించలేదని హతమార్చిన భర్త

పున్నేలుకు చెందిన అజారుద్దీన్, ఫర్హాత్(26) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉమేరా(8), ఆయేషా(6) ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఫర్హాత్ రెండుసార్లు ప్రెగ్నెంట్ అయింది. మళ్లీ ఆడపిల్లలు పుడతారనే అనుమానంతో అబార్షన్ చేయించాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ అయింది. ఈ సారి కూడా ఆడబిడ్డ పుడుతుందనే అనుమానించిన అజారుద్దీన్. అబార్షన్ చేయించుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో చాలాసార్లు గొడవపడ్డాడు. అలా కోపం పెంచుకున్న అతను పథకం ప్రకారం బుధవారం రాత్రి భార్య, పిల్లలను స్విమ్మింగ్ పూల్లో ముగ్గురినీ తోసేసి హతమార్చాడు.


