108, 102 సిబ్బందికి అధికారుల వార్నింగ్

రంగారెడ్డి జిల్లా కొందుర్గు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోని 102, 108 అంబులెన్స్లను జిల్లా వైద్య సేవల అధికారులు రాజబాబు, జాన్ షాహిద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఈ తనిఖీలు చేశారు. వాహనాల్లో ఆక్సిజన్, మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా చెక్ చేశారు. పేషెంట్లకు ఏమాత్రం లేట్ అవ్వకుండా, అంబులెన్స్లను 24/7 అందుబాటులో ఉంచాలని స్టాఫ్కి ఆదేశించారు.



