← Back to news

బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుశిక్ష

By DK· 11 Jun 2026· Hmtvlive· SURYAPET
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుశిక్ష

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దూరాజిపల్లి గ్రామంలోని తెళ్లబండ కాలనీకి చెందిన రాపాణి శ్రీనుపై ఓ గొడవ కేసులో చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సత్ప్రవర్తనతో మెలుగుతానని మండల మేజిస్ట్రేట్ వద్ద రూ.3లక్షల పూచీకత్తుతో బైండోవర్ చేసుకున్నాడు. అయితే శ్రీను బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగి నేరానికి పాల్పడ్డాడు. ఈ మేరకు చివ్వెంల పోలీసులు మరో కేసు నమోదు చేసి అతడిని మండల న్యాయవాది ముందు హాజరుపరిచారు. పూచీకత్తు మొత్తం రూ.3లక్షల జరిమానా విధించగా, చెల్లించలేకపోవడంతో తహశీల్దార్ ఉత్తర్వుల మేరకు 45రోజులు జైలుకు తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.