విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి

AP: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (RPC) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన యువతను వేధించడం సరైంది కాదన్నారు.


