రావులపాలెంలో పెన్షనర్స్ బిల్డింగ్

AP : విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో మండల పెన్షనర్స్ బిల్డింగ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగుల సేవలు మరువలేనివని కొనియాడారు. పదవీ విరమణ తర్వాత కూడా వారి అనుభవం ఎంతో విలువైనదని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.



