తీవ్ర విషాదం: తాటిచెట్టుపై హార్ట్ ఎటాక్

TG: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన చామకూరి వెంకన్న కల్లు గీసేందుకు రోజూలాగే మంగళవారం తాటిచెట్టు ఎక్కాడు. తాటికల్లు గీస్తుండగా ఒక్కసారిగా వెంకన్నకు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే చెట్టుపైనే మృతి చెందాడు. తాటివనంలో పనికి వెళ్లిన స్థానిక రైతులు వెంకన్న తాటిచెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే జేసీబీ, క్రేన్ సాయంతో తాడు బిగించి డెడ్బాడీని చెట్టుపై నుంచి కిందికి దించారు.



