సెలవులపై వచ్చిన ఆర్మీ ఉద్యోగి హత్య

TG: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ ఆర్మీ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. మెదక్ జిల్లా ర్యాలమడుగు విలేజ్కు చెందిన కుమార్ గౌడ్(49) ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా ఉత్తరాఖండ్లో డ్యూటీ చేస్తున్నాడు. ఆయన భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలతో మెదక్లో నివాసం ఉంటోంది. గతనెల 11న సెలవులపై ఇంటికి వచ్చిన కుమార్ గౌడ్, ఈ నెల 10న తిరిగి డ్యూటీకి వెళ్లాల్సి ఉంది. కొంతకాలంగా కుమార్ గౌడ్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని పద్మ, తన కుటుంబసభ్యులతో కలిసి కర్రలతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.



