పూజలు చేస్తామని నమ్మించి వెండి కడియాలతో పరార్

పూజల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు వెండి కడియాలు చోరీచేసిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలంలో జరిగింది. కోతుల్గావ్ గ్రామానికి చెందిన రైతు దత్తాత్రి ఇంట్లో ఆయన లేని సమయంలో అతని భార్య కవిత వద్దకు శాంతాబాయి, సాయవ్వ అనే మహిళలు ఆరోగ్య సమస్యలు తొలగించే పూజ చేస్తామని నమ్మించి లోపలికి వెళ్లారు. పూజ చేస్తున్న సమయంలో రైతు ఇంటికి రావడంతో వారిని బయటకు పంపించాడు. దేవుడి గదిలో పరిశీలించగా 5 తులాల రెండు వెండి కడియాలు కనిపించపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.



