రీసర్వేతో భూ వివాదాలకు చెక్

AP: గత ప్రభుత్వం ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా(22A) పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని CM చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుంది గ్రామంలో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 322 మంది రైతులకు ఎసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు. భూ వివాదాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సమీక్షిస్తున్నానని తెలిపారు. రీసర్వే చేసి వివాదాలను పరిష్కరిస్తున్నట్లు CM పేర్కొన్నారు.



