ఘోర ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం

TG: నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి వద్దనున్న నేషనల్ హైవేపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. నాగ్పూర్ వైపు నుంచి ఆలుగడ్డల లోడ్తో హైదరాబాద్ వైపు వస్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో హైవే పక్కన నిలిపివేశాడు. జొన్నల లోడ్తో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ, పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన లారీ డ్రైవర్ జవారి సింగ్ లారీ క్యాబిన్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.



