దైవ నామాలను ఎగతాళి చేయొద్దు: పవన్ కల్యాణ్

AP: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కుతూ చేసే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను రాజకీయాల కోసం పేరడీలుగా మారుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. నెల్లూరులో జరిగిన ఘటనలో ఆపోజిషన్ పార్టీ గోవింద నామాలను పేరడీగా వాడి భక్తుల మనోభావాలను కించపరిచారని అన్నారు. ఇలాంటి వాటిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పార్టీ కేడర్ను ఆదేశించారు. దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలు, కీర్తనలను కామెడీకి వాడొద్దని సూచించారు.


