విద్యార్థులకు ప్రధాని మోదీ భరోసా
నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకొస్తామని, దీనికి సంబంధించిన ప్రత్యేక బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని వెల్లడించారు. రీఎగ్జామ్ ద్వారా విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవాళ CJP ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు.


