← Back to news

స్తంభాన్ని ఢీ కొట్టిన లారీ: స్తంభించిన ట్రాఫిక్

By Adithya D· 23 Aug 2026

TG: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్, రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పాలమాకుల మధ్యన బ్రిడ్జి వద్ద లారీ స్తంభాన్ని ఢీకొట్టింది. గంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. 44వ నెంబర్ హైవే కావడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు జెసిబి ద్వారా లారీని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను అదుపు చేశారు.

More in Local