బైక్ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

AP: కర్నూలు జిల్లా జొన్నగిరి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బైక్, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మదనంతపురానికి చెందిన బాలమధు, మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



