← Back to news

డైరక్టర్ మెహర్ రమేష్ సోదరి మృతి ! పవన్ పరామర్శ

By DS· 22 Jul 2026· vijayawada
డైరక్టర్ మెహర్ రమేష్ సోదరి మృతి ! పవన్ పరామర్శ

డైరక్టర్ మెహర్ రమేష్ సోదరి జ్యోతి సుంకర మరణించారు. వైరల్ న్యుమోనియాకు విజయవాడలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆమె కన్నుమూశారు. తన చిన్నతనం నుంచి ఎంతగానో ఆదరించి, తల్లిలా చూసుకున్న తన అక్క ఇక లేదనే వార్తను తట్టుకోలేకపోతున్నానని మెహర్ రమేశ్ భావోద్వేగానికి గురయ్యారు.విషయం తెలిసిన వెంటనే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు మెహర్ రమేశ్‌ను పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

More in AP