పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

TG: ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీలోని గుర్రాలపాడుకు చెందిన బొబ్బాల లింగరాజుకు చింతకాని మండలం నరసింహపురానికి చెందిన స్వాతికి 9ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. లింగరాజు పాల వ్యాపారంతో పాటు, ఖమ్మంలోని మొబైల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఏడాది నుంచి ఖమ్మంలోని పంపింగ్ వెల్ రోడ్లో అద్దెకు ఉంటున్నారు. భార్యాభర్తలకు గొడవ జరగడంతో, స్వాతి ఇద్దరు కుమారులకు ఎలుకల మందు తాగించి, తాను కూడా తాగింది. స్థానికులు వెంటనే ముగ్గుర్నీ హాస్పిటల్కు తరలించారు. ఇద్దరు కుమారులు వేదిక్(7), తనుష్(5) మృతి చెందారు. తల్లి స్వాతి చికిత్స పొందుతోంది.



