చిరుత సంచారం.. తిరుమలలో హైఅలర్ట్

AP: తిరుమలలోని అలిపిరి కాలినడక మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి నరసింహస్వామి టెంపుల్ సమీపంలో చిరుత కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు భక్తులు ఒంటరిగా వెళ్లకుండా, గుంపులుగా ముందుకు సాగాలని సూచించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని TTD, ఫారెస్ట్ అధికారులు సూచించారు. అటవీ సిబ్బంది నడకమార్గ పొడవునా గస్తీ నిర్వహిస్తూ, CC కెమెరాల ద్వారా వన్యమృగాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.



