36 ఏళ్లుగా మసీదుల్లో ఖురాన్ రాస్తున్న హిందువు

మసీదుల గోడలపై ఖురాన్ ఆయతులను అందమైన కాలిగ్రఫీతో రాస్తున్నారు ఓ హిందువు. మహారాష్ట్రకు చెందిన అనిల్ కుమార్ చౌహాన్ హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఉర్దూ, అరబిక్ స్క్రిప్ట్లను నేర్చుకున్నారు. 1990ల మధ్యలో కిషన్బాగ్లోని మస్జిద్-ఎ-నూర్ మసీదులో మొదటిసారి ఖురాన్ రాసే అవకాశం వచ్చింది. మొదట్లో కొందరు అభ్యంతరం చెప్పినా, ఆయన జామియా నిజామియా దగ్గర పర్మిషన్ పొందారు. చాలా మసీదులకు ఆయన ఫ్రీగా పనిచేశారు. 2021లో రెహ్మత్ ఆలమ్ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు అందుకున్నారు. అనేక హిందూ దేవాలయాల్లో కూడా పెయింటింగ్లు వేశారు.





