గంజాయి తరలిస్తుండగా రోడ్ యాక్సిడెంట్

AP: తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన నలుగురు యువకులు ఒడిశా-ఆంధ్రా సరిహద్దులో 25కిలోల గంజాయి కొనుగోలు చేసి కారులో రవాణా చేస్తున్నారు. నున్నకు సమీపంలోకి రాగానే గంజాయి మత్తులో విజయవాడ బైపాస్లో ముందు వెళుతున్న కంటైనర్ను ఢీకొట్టారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారు గంజాయి మత్తులో ఉండడంతో పోలీసులు కారును పరిశీలించగా గంజాయి లభ్యమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుల్లో ఒకరు పరారయ్యాడు.



