← Back to news

లవర్ కోసం కన్న కొడుకునే చంపేసిన తల్లి!

By sahani· 20 Jun 2026· Siddipeta
లవర్ కోసం కన్న కొడుకునే చంపేసిన తల్లి!

సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి, జ్యోతి దంపతులు తమ రెండేళ్ల కొడుకు హరికృష్ణతో కలిసి కీసర పోలీస్ స్టేషన్ దగ్గర్లో ఉంటున్నారు. అయితే జ్యోతికి నవీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో లేని టైమ్‌లో ప్రియుడిని ఇంటికి పిలిచేది. వారు కలిసి ఉన్నప్పుడు బాబు ఏడుస్తుండడంతో నవీన్ చిరాకు పడ్డాడు. బాబును చంపేద్దామని నవీన్ అనడంతో జ్యోతి కూడా ఓకే చెప్పింది. ఇద్దరూ కలిసి బాబును కిందపడేసి కొట్టి చంపేశారు. ఫిట్స్ వచ్చి చనిపోయాడని నమ్మించారు. కానీ తండ్రికి డౌట్ రావడంతో 20 రోజుల తర్వాత ఈ నిజం బయటపడింది. ప్రెజెంట్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రియుడు నవీన్ పరారీలో ఉన్నాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 22h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.