చిన్నారి మృతితో హాస్పిటల్ వద్ద టెన్షన్ టెన్షన్

TG: డాక్టర్ల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి చెందింది. 5నెలల చిన్నారికి జ్వరం రావడంతో వికారాబాద్ జిల్లాలోని మహవీర్ హాస్పిటల్లో చేర్చారు. సెల్ఫోన్ ద్వారా వైద్యుల సూచనలతో చికిత్స చేయడంతోనే పాప చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. జ్వరం ఉందని తీసుకొస్తే హాస్పిటల్లో చేర్చుకోవడంలో, ట్రీట్మెంట్ చేయడంలో నెగ్లెన్స్ చేశారని, అందుకే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.



