'SIR'ను మరో 10రోజులు పొడిగించాలి

AP: SIR ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియను మరో 10 రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరారు. ఎన్యూమరేషన్ గడువు పొడిగించాలని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి, వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో SIR ప్రక్రియలో భాగంగా BLOలు చేపట్టిన ఇంటింటి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది.



