← Back to news

మత్తు మందిచ్చి, పాముతో కరిపించి భర్తను చంపిన మహిళ !

By DS· 18 Jul 2026· UP
మత్తు మందిచ్చి, పాముతో కరిపించి భర్తను చంపిన మహిళ !

మీరట్ లో ఒక షాకింగ్ మర్డర్ ప్లాన్ బయటపడింది. దామిని అనే మహిళ తన భర్త అతుల్ పవార్ కి పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయాక బెడ్‌పై విష పూరిత పాము ని వదిలి కరిపించింది. ఈ క్రైమ్‌లో ఆమెకి తన లవర్ , స్కూల్ డ్రైవర్ తుషార్ హెల్ప్ చేశాడు. ₹20 లక్షల ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేయడం, తమ రిలేషన్ షిప్ ని కంటిన్యూ చేయడమే వీరి మెయిన్ మోటివ్. అయితే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ,మొబైల్ రికార్డ్స్ పరిశీలించగా వీరికుట్ర బయటపడటంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. భార్యా భర్తలిద్దరూ హస్తినాపూర్ లో కిడ్స్ ప్లే స్కూల్ ని నడుపుతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 15h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.