స్కూటర్ టైర్లలో గోల్డ్.. ఎయిర్ పోర్టులో పట్టివేత!
దిల్లీ IGI ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్స్ భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి ముంబయి మీదుగా దిల్లీకి వచ్చిన ఓ ప్యాసెంజర్ను డౌట్తో చెక్ చేశారు. అతడి చెక్డ్ బ్యాగేజ్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ను పరిశీలించగా టైర్లలోని సాలిడ్ కోర్లో దాచిన 24 క్యారెట్ల బంగారం బయటపడింది. మొత్తం 19 ముక్కలుగా ఉన్న 869.5 గ్రా. గోల్డ్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లీగల్గా బంగారం తీసుకొచ్చినట్లు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.




