రివెంజ్ విత్ మర్డర్.. టీచర్ను అతి కిరాతకంగా చంపిన సైకో!

హరియాణాలోని ఫరీదాబాద్ సరస్వతి స్కూల్లో పనిచేస్తున్న సంధ్య (29) అనే టీచర్ను అమిత్ (21) అనే యువకుడు అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. పాఠశాల గేటు వద్ద కేవలం 30 సెకండ్లలోనే 27 సార్లు దారుణంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన పాఠశాల నిర్వాహకుడు తేజ్పాల్ ను కూడా బెదిరించి, అక్కడి నుండి బైక్పై పారిపోయాడు. గతంలో సంధ్య అతనిపై వేధింపుల కేసు పెట్టడంతో క్షమాపణ చెప్పిన నిందితుడు, మనసులో కక్ష పెంచుకుని ఈ హత్య చేశాడు. పోలీసులు అతడిని కేవలం రెండు గంటల్లోనే అరెస్ట్ చేశారు.



