సరైన చికిత్స అందక.. గురుకుల విద్యార్థిని మృతి!

పోలవరం జిల్లా కూనవరం కోతుల గుట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని తెల్లం జాహ్నవి (పల్లూరు గ్రామం) ఆదివారం మృతి చెందింది. శనివారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆమెను కోతులగుట్ట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరిగి హాస్టల్కు తీసుకురాగా తెల్లవారుజామున ఆరోగ్యం మరింత క్షీణించడంతో భద్రాచలం, ఆ తర్వాత ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. సకాలంలో సరైన చికిత్స అందకపోవడంతోనే మృతి చెందిందని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.

