జన్నారం క్లస్టర్కు కొత్త ఏఈవో అక్రమ్..

వార్త:మంచిర్యాల జిల్లా జన్నారం క్లస్టర్ ఏఈఓగా అక్రమ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం సింగరాయిపేట్ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జన్నారం క్లస్టర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే చింతగూడ ఏఈఓగా పనిచేస్తున్న లవన్ కు సింగరాయిపేట్ ఏఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ – "రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను" అని స్పష్టం చేశారు.

