ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. ఎంవీఐ హెచ్చరిక

AP: గుంటూరు జిల్లా మంగళగిరి పరిసరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు. 60 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటితే స్పీడ్ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానాలు విధిస్తామని తెలిపారు. ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించడంతోపాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

