పేదల బియ్యం కాజేసి.. బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు

TG: పెద్దపల్లి జిల్లాలోని కట్నేపల్లిలో సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్, సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ పేర్ల మీద రైస్ మిల్లర్ మారుతి ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్నాడు. 7,625 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడు. అలాగే పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే PDS బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.132 కోట్ల విలువైన బియ్యం కాజేసినట్లు లెక్క తేలింది. అతడిపై PD యాక్ట్ నమోదు చేశారు. పోలీసులు మారుతిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.



