నేటి నుంచి తెలంగాణ వన మహోత్సవం

TG : రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 16.06 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,242 ప్రభుత్వ నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, పర్యావరణాన్ని కాపాడటంలో తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఎకోపార్క్లో సీఎం 'నాగలింగం' మొక్కను నాటి "వనమహోత్సవం 2026" కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.



