← Back to news

పొలం బాట పట్టిన స్కూలు పిల్లలు

By srikanth· 23 Aug 2026· నర్సంపేట
పొలం బాట పట్టిన స్కూలు పిల్లలు

TG : వరంగల్ జిల్లా నర్సంపేటలోని Wisdom High School విద్యార్థులు వ్యవసాయ పొలాలను సందర్శించారు. ప్రాక్టికల్‌గా వరి పంట ఎలా పండిస్తారో తెలుసుకోవడానికి ఫీల్డ్ ట్రిప్ వెళ్లారు. ఉపాధ్యాయులు పిల్లలకు క్రాప్ ప్రాసెసింగ్ చూపించి లైవ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కేవలం క్లాస్‌రూమ్ బుక్స్ వరకే పరిమితం కాకుండా, ఇలాంటి ప్రకృతి పర్యటనల వల్ల స్టూడెంట్స్‌కి మైండ్ రిఫ్రెష్ అయ్యి బాగా అర్థమవుతుంది. రైతుల కష్టం, ఫుడ్ వాల్యూ, ‘రైతే దేశానికి వెన్నెముక’ అనే మెయిన్ కాన్సెప్ట్‌ను వీరికి నేర్పించడమే ఈ ట్రిప్ ముఖ్య ఉద్దేశం.

More in Local