← Back to news

Studentsతో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్

By Bhasker· 25 Aug 2026· నాగర్‌కర్నూల్
Studentsతో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్

TG : భవిష్యత్ తరాల కోసం అందరూ మొక్కలు నాటి కాపాడాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పిలుపునిచ్చారు. పెద్ద ముద్దునూరు ZPHS పాఠశాలలో జరిగిన వన మహోత్సవంలో విద్యార్థులతో కలిసి ఆయన 100 మొక్కలు నాటారు. ప్రతి స్టూడెంట్ ఒక మొక్కను నాటి ఇంట్లో మనిషిలా చూసుకోవాలని, ఆక్సిజన్, మంచి వర్షాల కోసం చెట్లు చాలా ముఖ్యమని చెప్పారు. పాఠశాలలు, ఆఫీసుల్లో ప్లాంటేషన్ పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్ రేవంత్ చంద్ర, సర్పంచ్ ఊర్మిలమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

More in Local