సముద్రంలో చిక్కుకున్న మరో ఫిషింగ్ బోటు

AP: సముద్రంలో ఇంజిన్ మొరాయించడంతో విశాఖకు చెందిన మరో ఫిషింగ్ బోటు ఒడిశాలోని పూరి సముద్ర జలాల్లో చిక్కుకుపోయింది. జూన్ 22న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 9మంది మత్స్యకారులు బోటు ఇంజిన్ ఆగిపోవడంతో సముద్రంలోనే చిక్కుకుపోయారు. తాము సురక్షితంగా ఉన్నామని, తమను కాపాడాలని మత్స్యకారులు వీడియో సందేశం ద్వారా తమ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తక్షణమే విశాఖ కలెక్టర్తో మాట్లాడారు. కలెక్టర్.. కోస్ట్గార్డ్ బృందాల సాయంతో మత్స్యకారులను రక్షించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.



