భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

TG: భార్య వేధింపులు తట్టుకోలేక పెళ్లయిన మూడు నెలలకే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన సదర్ లాల్(27) తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేస్తున్నాడు. మేలో హర్యాతండాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. మగతనం లేదని అతని భార్య వేధిస్తోంది. ఇటీవల అత్తగారింటికి వెళ్లగా కుటుంబ సభ్యులతో కలిసి సదర్ లాల్ను అవమానించింది. తీవ్ర మనస్తాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.



