భారీ మెజార్టీ ఇస్తేనే పోటీ.. లేదంటే నో: కోమటిరెడ్డి

TG: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తేనే తాను పోటీ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మండలం కంచనపల్లిలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అత్యధిక మెజార్టీ ఇవ్వలేకపోతే తాను ఎన్నికల బరిలో ఉండనని స్పష్టం చేశారు. తాను నియోజకవర్గానికి ప్రచారం కోసం రాకపోయినా, ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు.


