← Back to news

భారీగా డ్రై గంజాయి పట్టివేత

By gani· 28 Aug 2026· Gokavaram, Gokavaram, East Godavari
భారీగా డ్రై గంజాయి పట్టివేత

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద పోలీసులు భారీగా డ్రై గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ నుంచి గంజాయిని కారులో రాజమహేంద్రవరం మీదుగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, గంజాయి రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, సరఫరా నెట్‌వర్క్‌పై కూడా ఆరా తీస్తున్నట్లు డి.ఎస్.పి జీవన తెలిపారు.

More in Local